ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. కొంతమంది ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా కరోనా  వైరస్ కారణంగా గోవా మాజీ  ఆరోగ్యశాఖ మంత్రి సురేష్ అమోంకర్  కన్నుమూశారు. 

 

 జూన్ చివరి వారంలో ఆయనకు పాజిటివ్ అని నిర్ధారణ కాగా మార్కొవ లోని ఈఎస్ఐ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటూ కన్ను మూశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విశ్వజిత్ ధ్రువీకరించారు. ఇక ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: