ఆంధ్రప్రదేశ్ లో కరోన నివారణ పై పలు రాష్ట్రాల నుంచి ప్రసంశలు వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కోరనా పరిక్షలు వేగంగా చేయడమే కాకుండా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించడం తో విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో కరోనా వ్యాప్తి కాస్త అదుపులో ఉంది అనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సిఎం జగన్  పరిక్షల విషయంలో కూడా నేరుగా సమీక్షలు చేస్తున్నారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఏపీలో కరోనా నియంత్రణ పై తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి ప్రసంశలు కురిపించారు. కరోనా పరీక్షలను చాలా బాగా చేస్తున్నారు  కరోనా కట్టడిలో సిఎం జగన్ సక్సెస్ అయ్యారు అని అన్నారు ఆయన. తెలంగాణా సిఎం కేసీఆర్ విఫలం అయ్యారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: