టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం సరిగా లేదు అని పలువురు టీడీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయితే దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

 

ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా  ఈ డ్రామాలేంటి అచ్చన్నా? అంటూ ఆయన అచ్చెన్నాయుడు ని ఎద్దేవా చేసారు. కార్పొరేట్ ఆస్పత్రే కావాలా?   ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? అని ప్రశ్నించారు. మీ చంద్రబాబు నాయుడు హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆస్పత్రులకు అన్ని హంగులు  అద్దిందని... సమస్య వస్తే చూసుకుంటుందని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: