ఇళ్ల పట్టాలలో అవినీతి జరిగితే నిరూపించాలని విపక్ష తెలుగుదేశం పార్టీకి మంత్రి అవంతి శ్రీనివాస్ సవాల్ చేసారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ విపక్షంపై మండిపడ్డారు. సిఎం జగన్ పార్టీలకు అతీతంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అని భావిస్తే చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు అని ఆయన మండిపడ్డారు.

 

ఇళ్ళ పట్టాల విషయంలో కూడా రాజకీయం చేస్తున్నారు అని ఆయన తీవ్ర ఆరోపణలు చేసారు. ఏ పని చేసినా సరే ఇదే విధంగా అడ్డుకుంటున్నారు అంటూ అవంతి ఆరోపణలు చేసారు. ఓడించారు కాబట్టి ప్రజల మీద ఈ విధంగా కక్ష సాధిస్తున్నారు అని, ఇది దిగజారుడు రాజకీయం అని ఆయన ఆరోపించారు. విశాఖలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినా సరే రెండు లక్షల మందికి ఇళ్ళ పట్టాలు అందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: