ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిక్షలు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా కరోనా పరీక్షలను చాలా వరకు పెంచుతూనే ఉన్నారు. కరోనా లక్షణాలు ఉన్నా లేకపోయినా సరే కాంటాక్ట్ ఉన్న అందరికి కరోనా పరీక్షలను చేస్తున్నారు. ఏపీలో కరోనా పరిక్షలు మరో మార్క్ ని దాటాయి.
ఏపీలో కరోనా పరిక్షలు ఇప్పటి వరకు 10 లక్షల 50 వేల వరకు చేసారు. కరోనా కట్టడిలో పరిక్షలు కీలకం కావడంతో ఈ పరీక్షలను వేగంగా చేస్తుంది ఏపీ సర్కార్. ఇక ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో కడప జిల్లాలో పరిక్షలు పెంచాలి అని సిఎం జగన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ రెండు జిల్లాల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉందన్నారు ఆయన.