ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ పేదలకు 32 లక్షల ఎకరాలు పంచారు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రేపు వైఎస్ జయంతి సందర్భంగా పార్టీ నేతలు అందరూ కూడా విగ్రహాలకు  దండలు వేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని  ఆయన కోరారు. 

 

సిఎం వైఎస్ జగన్ కూడా అదే  బాటలో నడుస్తున్నారు అని అన్నారు. వైఎస్ జయంతిని రాష్ట్ర ప్రజలు అందరూ జరుపుకోవాలి అని అంబటి అన్నారు. వైఎస్  మరణించినా సరే ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అని అంబటి అన్నారు. జగన్ ని చూసి పై లోకం లో ఉన్న వైఎస్ గర్వపడతారు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన స్ఫూర్తి తో ఏపీలో 4 కోట్ల మందికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: