రెండు మూడు పరిక్షలు కూడా చేయలేని పరిస్థితి నుంచి నేడు ఏకంగా 25 వేల పరిక్షల వరకు వెళ్లామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు. ఇఫ్పటి వరకూ 10 లక్షలకు పైగా టెస్టులు చేయగలిగామని ఆయన నేడు నిర్వహించిన కరోనా సమీక్ష సమావేశంలో వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో సిఎం... కలెక్టర్ లు సహా వైద్య శాఖ అధికారులను అభినందించారు.
అదే విధంగా హోం ఐసోలేషన్ అన్నది చాలా ముఖ్యమైన అంశం అన్నారు సిఎం. 80శాతం కేసులు ఇంట్లోనే నయం అవుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సిఎం సూచించారు. హోం ఐసోలేషన్కు రిఫర్ చేసే వారిని సరిగ్గా చూసుకుంటున్నామా? వారికి మందులు సరిగ్గా అందుతున్నాయా, లేదా...? అనేది నిత్యం చూడాలి అని సూచించారు.