తెలంగాణా సిఎం కేసీఆర్ లక్ష్యంగా ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇంతకాలం ప్రజాతీర్పు తనకు అనుకూలంగా ఉందని విర్రవీగిన పోయిన దొరగారు అంటూ ఆమె విమర్శలు చేసారు. త్వరలో తెలంగాణ ప్రజల తిరస్కారాన్ని, తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఆమె వ్యాఖ్యలు చేసారు. తాజా పరిణామాలను చూస్తుంటే ఇదే అర్థం అవుతోందని ఆమె పేర్కొన్నారు.
ప్రతి విషయంలోనూ ఉచిత సలహాలు ఇస్తూ, మాయమాటలు చెప్పి, తనను మేధావిగా ప్రదర్శించుకునే ప్రయత్నం చేసే కేసీఆర్ కరోనా మహమ్మారిని కట్టడి చేసే విషయంలో చేతులెత్తేసారు అని... అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిందని ఆమె విమర్శించారు. కరోనా గురించి విపక్షాలు హెచ్చరిస్తే సిఎం దొర దాన్ని అవమానించారు అని ఆమె మండిపడ్డారు.