భారత సైన్యంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి సైనికులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా సరే కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి. తాజాగా దాదాపు 70 మంది సైనికులకు కరోనా వైరస్ సోకింది అని అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో బోర్డర్ సెక్యురిటి ఫోర్స్ లో 69 మంది సైనికులకు కరోనా సోకింది అని వెల్లడించారు. 

 

29 మంది కరోనా వైరస్ నుంచి పూర్తిగా బయటపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 1454 గా ఉంది అని భారత ఆర్మీ పేర్కొంది. వీటిలో 852 మంది కోలుకున్నారు అని 595 క్రియాశీల కేసులు ఉన్నాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్‌ఎఫ్) పేర్కొంది. సైనికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: