ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. రోజు రోజుకి అక్కడ కేసులు మాత్రం భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వ చర్యలు కొంత మేర మాత్రమే ఫలిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కరోనా విషయంలో అక్కడి వ్యాపారులు కూడా భయపడుతున్నారు. రాజమండ్రి నగరంలో కరోనా కేసులు ప్రతీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. 

 

ఈ నేపధ్యంలో వెంకటేశ్వర జనరల్ మార్కెట్‌ అసోసియేషన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ప్రతీ రోజు కూడా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే షాపులు ఓపెన్ చెయ్యాలి అని నిర్ణయం తీసుకుని షాపులకు ప్రత్యేకంగా నోటీసులు కూడా అంటించారు. రేపటి నుంచి ఇది అమలు చేస్తామని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: