గత కొన్ని రోజులుగా బీహార్లో పిడుగుల వర్షం కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పిడుగుల వర్షం బీభత్సం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పిడుగులు పడుతున్న నేపథ్యంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. 


 ఈ రోజు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాష్ట్రవ్యాప్తంగా పిడుగుపాటుకు గురై ఏకంగా 7 మంది ప్రాణాలు కోల్పోయారు.  బెగుసరాయ్ జిల్లా లో ముగ్గురు మృతి చెందగా మిగతా ప్రాంతాల్లో మరో నలుగురు మృతి చెందారు. జూన్ నెలాఖరులో ఒకేరోజు 83 మంది పిడుగుపాటుకు గురై మరణించగా.. . జూలై 3న 23 మంది పిడుగుపాటుకు మృతి చెందారు.  బీహార్లో మొత్తం 220 మంది పిడుగుపాటుతో ప్రాణాలు కోల్పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: