చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ రాష్ట్రంలోని అన్షున్ నగర సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిచారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది సీసీటీవీ ఛానల్. బస్సు అకస్మత్తుగా వేగం పెరిగి.. ఆరు లైన్ల రహదారి, దాని పక్కన ఉన్న కంచెను దాటుకుని సరస్సులోకి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అన్షున్ నగర అధికారులు తెలిపారు. జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.
A bus fell into a lake in Anshun in China's Guizhou Province. Rescue is underway and the number of casualties is unknown pic.twitter.com/yNMBt6wjo8
— china Xinhua news (@XHNews) July 7, 2020