చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. గుయిజౌ రాష్ట్రంలోని అన్షున్​ నగర సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న సరస్సులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 21 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిచారు.

 


ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది సీసీటీవీ ఛానల్​. బస్సు అకస్మత్తుగా వేగం పెరిగి.. ఆరు లైన్ల రహదారి, దాని పక్కన ఉన్న కంచెను దాటుకుని సరస్సులోకి దూసుకెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ప్రయాణికుల్లో ఎక్కువ మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉన్నట్లు అన్షున్​ నగర అధికారులు తెలిపారు. జాతీయ విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష రాసేందుకు వెళుతున్నట్లు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: