దేశ ఆర్థిక వ్యవస్థను సక్రమంగా నిర్వహించకపోతే విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థ నిర్వహణ పక్కదారి పడితే లక్షలాది కుటుంబాల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని అన్నారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ దుర్నిర్వహణ ఓ విషాదం. దీని ప్రభావం లక్షలాది కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇకపై ఈ పరిస్థితిని చూస్తూ సహించేది లేదు. " అని పేర్కొన్నారు.కరోనా మహమ్మారి వల్ల 2020-21లో దేశ ఆర్థికాభివృద్ధి 4.5 శాతానికి తగ్గుతుందని తెలిపే ఓ నివేదికను ఈ ట్వీట్కు జత చేశారు రాహుల్. కొవిడ్ ప్రభావం వల్ల పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల ప్రజలే గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ప్రాణాంతక వైరస్ వల్ల దేశంలో పేదరికం మరింత పెరిగిందని మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయంటూ రాహుల్ తెలిపారు.
India’s economic mismanagement is a tragedy that is going to destroy millions of families.
— rahul gandhi (@RahulGandhi) July 7, 2020
It will no longer be accepted silently.#BJPsDistractAndRule pic.twitter.com/6idGN1A7xS