భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ముంబయిలోని నివాస భవనం 'రాజ్​గృహ​'పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో అంబేడ్కర్​ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఈ దుశ్చర్యను మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్​ముఖ్ ఖండించారు.

 

ఈ దాడిపై స్పందించిన అంబేడ్కర్​ మనవడు ప్రకాశ్​ అంబేడ్కర్​.. రాజ్​గృహ​ వెలుపల ప్రజలెవరూ చేరవద్దని, సంయమనంతో ఉండాలని కోరారు. ఇది చిన్న ఘటన అని, శాంతియుతంగా ఉండాలని మరో మనవడు భీంరావ్​ అంబేడ్కర్​ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: