వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ దివంగత సీఎం, ప్రియతమ నేతపై మరో పుస్తకం రాశారు. నేడు మహానేత వైయస్సార్ జయంతి సందర్భంగా "నాలో...నాతో...వైఎస్సార్" పుస్తకాన్ని నేడు ఏపీ సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. వైయస్సార్ అర్ధాంగిగా విజయమ్మ 37 సంవత్సరాల జీవితసారం ఈ పుస్తకంలో ఉంది. వైయస్సార్ గురించి ప్రజలకు తెలియని ఎన్నో విషయాల గురించి విజయమ్మ ఈ పుస్తకం ద్వారా తెలియజేయనున్నారు.
నిజ జీవితంలో వేర్వేరు పాత్రల్లో రాజశేఖర్ రెడ్డి ఎలా ఉండేవారో ఈ పుస్తకం ద్వారా ఆమె ప్రజలకు తెలియజేయనున్నారు. పేదల, రైతుల, మధ్యతరగతి వర్గాల కోసం వైయస్సార్ చేసిన కృషి వల్లే నేటికీ ఆయనను ప్రజలు ఆరాధిస్తున్నారని... ఆయన జీవితంలో తొలినాళ్ల నుండి మరణం వరకు జరిగిన పరిణామాలన్నీ ఈ పుస్తకంలో పేర్కొన్నారు. రాబోయే తరాలకు కూడా వైయస్సార్ గురించి స్పూర్తి ఇవ్వాలనే సంకల్పంతో ఈ పుస్తకాన్ని ఆమె ప్రజల ముందుకు తెస్తున్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, దివంగత వైయస్ఆర్ గారి సతీమణి శ్రీమతి వైయస్ విజయమ్మ గారు రాసిన " నాలో.. నాతో YSR" పుస్తకాన్ని రేపు మహానేత జయంతి సందర్భంగా ఆవిష్కరించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్. #LegendYSRJayanthi pic.twitter.com/gnlxvyupKa
— congress PARTY' target='_blank' title='ysr congress-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ysr congress party (@YSRCParty) July 7, 2020