ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ వైయస్సార్ లా నేస్తం నిధులను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే జనసైనికులు జగన్ నిర్ణయంతో ఆనందపడుతున్నారు. జగన్ నిధులు విడుదల చేయడానికి పవన్ కారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. జగన్ సర్కార్ మార్చి నెల నుంచి జూన్ నెల వరకు నెలకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని విడుదల చేసింది. 
 
గత కొద్ది నెలలుగా లాయర్లకు ఆర్థిక సహాయం అందకపోవడంతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వం లాయర్లను ఆదుకోవాలని జులై 5వ తేదీన లేఖ రాశారు. పవన్ లేఖ రాసిన వెంటనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో పవన్ గ్రేట్ అంటూ జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ పోరాటం వల్లే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని వాళ్లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: