టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. ‌తన 39వ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ధోనీ ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఇకపై యాడ్స్ లో నటించబోనని తేల్చి చెప్పారు. అదే సమయంలో తాను సేంద్రీయ వ్య‌వ‌సాయానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ లా మారాలనుకుంటున్నట్లు కీలక ప్రకటన చేశారు. తనే సొంతంగా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసి మార్కెట్ లోకి విడుదల చేయబోతున్నానని అన్నారు. 
 
ధోనీ కరోనా, లాక్ డౌన్ వల్ల మారిన పరిస్థితుల్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఫామ్ హౌస్ కు పరిమితమైన ధోనీ ఏ మొక్క‌ను ఎలా నాటాలి? వాటిని ఎలా పెంచాలి? స‌హ‌జ‌మైన ఎరువు ఎలా త‌యారు చేయాలి? ఇలా అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. నియో గ్లోబ‌ల్ పేరుతో ధోనీ పండించే ఉత్ప‌త్తులు మార్కెట్లోకి రాబోతున్నాయని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: