గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టులో సీఎం కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను చెప్పాలని నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మాండమస్ పిటిషన్ ను దాఖలు చేశారు. ప్రగతి భవన్ లో 30 మందికి కరోనా నిర్ధారణ కావడంతో సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కు వెళ్లిపోయాడని పిటిషనర్ పేర్కొన్నారు. 
 
ప్రజలకు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కరోనా కష్ట కాలంలో తన బాధ్యతలను సరిగ్గా నిర్వహించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారని సోషల్ మీడియా వివిధ వార్తలు ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: