అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ఈ నెల 3న పరువు హత్య చోటు చేసుకుంది. ధర్మవరంలోని లక్ష్మీచెన్నకేశవపురంలో లలితకుమారి అనే మహిళను దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు మహిళ మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. లలితకుమారి భర్త నాగరాజు రెండు నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 
 
ఆమె ఒక యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తేలడంతో సొంత బంధువులే హత్య చేసినట్లు సీఐ తెలిపారు. 20 నిమిషాల వ్యవధిలో హత్య జరిగిందని పోలీసులు చెప్పారు. తాత, చిన్నాన్న, మరో ఇద్దరు వ్యక్తులు కలిసి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వివాహేతర సంబంధం వల్ల పరువు పోతుందనే హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: