ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో భారీ గా కేసులు పెరిగాయి. మొత్తంగా 1346 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
అంతేకాకుండా గత 24 గంటల్లో 518 మంది కరోనా భారీ నుంచి కోలుకున్నారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ఇల్లు దాటి బయటకు రావొద్దు అంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.