టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు ని ఈఎస్ఐ స్కామ్ విషయంలో ఏసీబీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా అచ్చన్నాయుడు కేసులో ఏసీబీ కి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనను వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే హైకోర్టు ఆదేశాలపై ఏసీబీ తరపున న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు... అచ్చన్నాయుడు ని ఏ ఆస్పత్రికి తరలించాలి అన్నది గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ నిర్ణయించాలని ఆయన వాదించారు, కానీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చెప్పిన విధంగా అచ్చన్నాయుడు ను గుంటూరు రమేష్ ఆస్పత్రి కు తరలించినట్లు తెలుస్తోంది.