తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆర్టీసీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. మంచిర్యాల ఆర్టిసి డిపో గ్యారేజ్ లో విధులు నిర్వహించే ఉద్యోగికి పాజిటివ్ రావడంతో తర్వాత రోజు విధులకు హాజరు కావడానికి తోటి ఉద్యోగులు కాస్త వెనకడుగు వేశారు.
ఉదయం 9 గంటల వరకు విధులకు హాజరు కావాల్సి ఉన్న మధ్యాహ్నం వరకు హాజరుకాలేదు. ఇక ఆ తర్వాత డిఎం వైద్యుడి కౌన్సిలింగ్తో విధులకు హాజరయ్యారు,