దేశంలో క‌రోనా కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. గ‌త కొన్ని రోజులుగా స‌గ‌టున 22 వేల‌కు పైగానే కొత్త కేసులు న‌మోదు అవుతోన్న సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి ఒక్క‌రు తీవ్ర ఆందోళ‌న‌తో ఉన్నారు. ఇదిలా ఉంటే రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతుండ‌డం మాత్రం శుభ ప‌రిణామ‌మే అని చెప్పాలి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 22, 752 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసులు 7, 42, 417 కు కేసులు చేరుకున్నాయి. ప్ర‌స్తుతం దేశంలో 2, 64, 944 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

 

ప్ర‌స్తుతం దేశంలో 4,56,830 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. కాస్త గుడ్ న్యూస్ ఏంటంటే దేశంలో రోజు రోజుక క‌రోనా కేసులు పెరుగుతున్నా అదే స్థాయిలో రిక‌వ‌రీ రేటు కూడా పెరుగుతోంది. ప్ర‌స్తుతం మ‌న దేశంలో క‌రోనా రిక‌వ‌రీ రేటు కూడా 62 శాతంగా ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: