దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజమమ్మ రాసిన "నాలో.. నాతో వైఎస్సార్" పుస్తకాన్ని ఈరోజు ఉదయం సీఎం జగన్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. నాన్న జయంతిని పురస్కరించుకుని అమ్మ.. నాన్నను చూసిన విధంగా.."నాలో.. నాతో వైఎస్ఆర్'' రచన చేశారని.... నాన్నలోని గొప్పతనాన్ని అమ్మ ఆవిష్కరించారని సీఎం జగన్ చెప్పారు. తాజాగా వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా ఈ పుస్తకం గురించి స్పందించారు.
తనకు మాత్రమే తెలిసిన కోణం నుండి నాన్నను లోకానికి ఈ పుస్తకం ద్వారా అమ్మ కొత్తగా పరిచయం చేసిందని చెప్పారు. ఈరోజు నుండి అమెజాన్ లో "నాలో నాతో వైయస్ఆర్" పుస్తకం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. వైయస్సార్ జయంతి సందర్భంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నాయి.
తనకు మాత్రమే తెలిసిన కోణం నుండి నాన్నను లోకానికి కొత్తగా పరిచయం చేసింది అమ్మ.
— YS Sharmila (@ys_sharmila) July 8, 2020
ఈరోజు నుండి అమెజాన్ లో " నాలో నాతో వైయస్ఆర్" పుస్తకం అందుబాటులో ఉంటుంది.https://t.co/cKWPP0xvQT#LegendYSRJayanthi #YSRForever #YSRLivesOn #NaloNathoYSR pic.twitter.com/0MN8evBPWZ