విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం లింగంపేట లో అక్రమంగా తరలిస్తున్న 1200 కిలోల గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. లింగంపేట వద్ద రోజు వారి విధులలో  తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు గంజాయిని తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. ఇక లారీలో ఉన్న నలుగురు వ్యక్తుల్లో  ఇద్దరు పరారవ్వగా ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


 లారీ లో సుమారు పన్నెండు వందల కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వీటి విలువ 60 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. వ్యక్తుల దగ్గర నుంచి లారీని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: