ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,062 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో రాష్ట్రానికి చెందిన వాళ్లు 1,051 మంది కాగా ఇతర ప్రాంతాలకు చెందిన వాళ్లు 9 మంది ఉన్నారు. గత 24 గంటల్లో 27,643 మందికి పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. 
 
గత 24 గంటల్లో నమోదైన కేసులతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 22,259కు చేరగా మృతుల సంఖ్య 264కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,77,733 మందికి పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,894 యాక్టివ్ కేసులు ఉండగా 11,101 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: