ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఏపీ ప్రభుత్వానికి మరోసారి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేస్ లో స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ ఏపీ గవర్నమెంట్ కి అక్షింతలు వేయడంతో పాటు హైకోర్టు తీర్పు సమర్థించింది. ఇక ఈ విషయంలో హైకోర్టు తీర్పుపై ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా... సుప్రీంలోనూ ప్రభుత్వానికి తిరస్కరణ ఎదురవ్వగా అక్కడ కూడా ఏపీ హైకోర్టు తీర్పునే సమర్థించింది. ఇక దీనిపై తుది విచారణ మూడు వారాల పాటు వాయిదా వేశారు.