దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ జయంతి సందర్భంగా నేడు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మంచు మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా స్నేహ శీలి, రాజకీయ దురంధరుడు, మాట తప్పలేరు మానధనులు అన్న పోతన మాటకు నిలువెత్తు నిదర్శనం వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. పేద ప్రజల దైవం, బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు అని పేర్కొన్నారు. 
 
బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మ శాంతి కలగాలని, ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నానని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డికి, మోహన్ బాబుకు మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే. వైయస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ నేడు తల్లి విజయమ్మ రాసిన నాలో....నాతో...వైయస్సార్ పుస్తకాన్ని మరియు ఇడుపులపాయలో వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: