మే నెల 7న విశాఖ జిల్లా వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు నిన్న 12 మందిని అరెస్ట్ చేశారు. హైపవర్ కమిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విశాఖ గ్యాస్ లీకేజీ చోటు చేసుకున్నట్లు నివేదిక ఇచ్చింది. దీంతో ఆ సంస్థ సీఈవో, ఇద్దరు డైరెక్టర్లు సహా 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఈ దుర్ఘటన జరిగిన రోజునే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు కాగా తాజాగా ఈ ఘటనలో అరెస్టులు చోటు చేసుకున్నాయి. అరెస్ట్ అయిన వారిని పోలీసులు ఆన్ లైన్ ద్వారా మేజిస్ట్రేట్ ద్వారా హాజరు పరిచారు. 15 రోజులు రిమాండ్ విధించారని... ఈ నెల 22వరకు నిందితులు రిమాండ్ లో ఉంటారని పోలీస్ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: