గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. మరోవైపు అధికార పక్షంపై బీజేపీ కూడా రుస రుసలాడుతుంది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ది పనులు పలువురు నేతలు జీర్ణించుకోలేకపోవడంతో పదే పదే విమర్శలు చేస్తున్నారని అధికార పక్షం విమర్శిస్తుంది. ఇక వైసీపీ నేత విజయసాయిరెడ్డి కొంత కాలంగా ట్విట్టర్ వేధికగా ప్రతిపక్షంపై విరుచుకు పడుతున్నారు.

 

తనదైనా మాటల బాణాలు వదులుతున్నారు. తాజాగా టీడీపీ మిడతల దండు బీజేపీ కమలంపై వాలేందుకు బయల్దేరిందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయగా, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అవసరంలేదంటూ సీఎం జగన్ కు లేఖ రాశారు.

 

దానికి వెంటనే విజయసాయిరెడ్డి కూడా స్పందించి... తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న.. ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.? అంటూ ట్విట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: