భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ప్రతి సంవత్సరం దాదాపు పుట్టినరోజు నాడు ఆయన అభిమానులు అందరూ ఇంటికి వెళ్ళి ఆయనను కలిసే వారు. కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా అది కుదరలేదు . ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకున్న అభిమానులు గంగూలీ పుట్టిన రోజును సెలబ్రేట్ చేశారు.
గంగూలి ఫొటోతో ఉన్న ముసుగులను అభిమానులు అందరికీ పంపిణీచేశారు. 1996లో లార్డ్ యొక్క తొలి ఫోటో అలాగే ప్రస్తుతం ఫోటోలతో ముసుగులు తయారు చేసి.. ప్రజలందరికీ పంచినట్లు గంగూలి అభిమాని తెలిపారు.