ఎల్జి పాలిమర్స్ గ్యాస్ ప్రమాద ఘటనలో కారకులైన 12మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు  సెకండ్ అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఎల్జి పాలిమర్స్ కంపెనీ సీఈఓ డైరెక్టర్ తో సహా 12 మందిని... మంగళవారం విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. 

 

 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు వారిని  న్యాయమూర్తి ముందు హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అనంతరం వీరిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని నివేదికలో పేర్కొన్న 24 గంటల్లోనే జగన్ సర్కార్.. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు చేపట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: