హైదరాబాద్ నగరంలో రోజురోజుకు కరోనా  వైరస్ బ్రేక్ డాన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో  దాదాపుగా 70 శాతం కేసులు కేవలం హైదరాబాద్ నగరంలోనే ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. 

 

 ఈ నేపథ్యంలో గోల్కొండ చార్మినార్ లను  ఈ నెల 31 వరకు మూసి ఉంచనున్నట్లు తాజాగా అధికారులు ప్రకటించారు. గోల్కొండ చార్మినార్ సందర్శనకు  పర్యాటకులు ఎవరు రావద్దని కోట సహాయ నిర్వహణాధికారి నవీన్ కుమార్ తెలిపారు . రోజురోజుకు కరోనా  వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: