హైదరాబాద్ లో బోనాల పండుగ కు ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య బోనాల పండుగ జరుగుతుంద లేదా అని అయోమయం అందరిలో నెలకొంది. ఈ నేపథ్యంలోనే బోనాల పండుగను ఇళ్లలోనే జరుపుకోవాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. 

 

 ఎవరు కూడా బోనాలను చేసుకొని దేవాలయాలకు రావద్దు అంటూ తెలిపారు. ఈసారి గోల్కొండ సికింద్రాబాద్ మహంకాళి లాల్ దర్వాజా దేవాలయాల్లో బోనాల సమర్పణ లేదు అంటూ స్పష్టం చేశారు సీపీ అంజనీ కుమార్. అయితే జూన్ 25న ఎంతో ప్రతిష్టాత్మకమైన గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాలు ప్రారంభమైన విషయం తెలిసిందే అయితే ఎప్పటిలా  కాకుండా పరిమిత సంఖ్యలో భక్తులను  అనుమతించారు అధికారులు ఆదేశించారు..

మరింత సమాచారం తెలుసుకోండి: