దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా తాజాగా రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ జయంతి రోజునే రైతు దినోత్సవం అంటూ చెప్పుకొచ్చారు. 

 

 ఈ సందర్భంగా రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఏపీ లోని నీటి ప్రాజెక్టుల విషయంలో తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తుందని... ఏ సంవత్సరం ఏ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్ మరింత సస్యశ్యామలం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. తమ  ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వం అంటూ తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి..

మరింత సమాచారం తెలుసుకోండి: