ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ మహమ్మారి గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి రోజు భారీ మొత్తంలో కేసులు నమోదవుతున్నాయి. 24 గంటల్లో 1196 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తాజాగా ప్రభుత్వం తెలిపింది. 

 

 తాజాగా నమోదైన కేసులో తో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 29,968 కి  చేరింది. అయితే కేసులు భారీగా పెరుగుతున్నప్పటికీ రికవరీ రేటు కూడా కాస్త ఎక్కువగానే ఉండడం ప్రస్తుతం అందరికీ ఉపశమనం ఇస్తుంది. ఇప్పటి వరకు 20, 331 మంది కరోనా నుంచి కోలుకోగా..  9980 మంది చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: