ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో అయితే వరుసగా స్టార్ హీరోలు కన్నుమూశారు. ఒక్క బాలీవుడ్ లోనే కాదు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన నటులు, సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూశారు. దాంతో ఇండస్ట్రీ వైపు నుంచి ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందా అని అభిమానులు కలత చెందుతున్నారు. తాజాగా ప్రముఖ సీనియర్‌ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె గత మూడున్నర దశాబ్దాలుగా ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నారు.

IHG

అయితే, నిన్న అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో కుటుంబ సభ్యులు జయంతిని బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు వెంటిలేటర్ అమర్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

IHG

ఈ నేపథ్యంలో జయంతి బాధపడుతున్న లక్షణాలను పరిగణనలోకి తీసుకున్న వైద్యులు కరోనా పరీక్షలు చేయించినట్టు తెలుస్తోంది. ఈ పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చినట్టు సమాచారం.  ఈ సందర్భంగా నటి జయంతి తనయుడు కృష్ణకుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన తల్లి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆమె కోలుకుంటున్నారని వెల్లడించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: