ప్రస్తుతం శరవేగంగా విజృంభిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రజాప్రతినిధులను సైతం కదిలిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బెంగళూరు మేయర్ సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. గత కొన్ని రోజుల నుంచి తన వెంటే ఉన్నా అసిస్టెంట్కు కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో బెంగళూరు మేయర్ గౌతమ్ కుమార్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
మేయర్ గౌతమ్ కుమార్ తో పాటు ఆయన కార్యాలయ సిబ్బంది కూడా సొంతంగా క్వారంటైన్ లో ఉన్నారు, ఇక మేయర్ కార్యాలయంను అధికారులు సీల్ చేశారు. శానిటైజేషన్ నిర్వహించిన తర్వాత తిరిగి కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు . ఇక మేయర్ అసిస్టెంట్ కి కరోనా ఎలా సోకిందనే దానిపై అధికారులు దృష్టిసారించారు.