తెలంగాణ రాష్ట్ర కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రజాప్రతినిధులు సైతం మహమ్మారి వైరస్ బారిన పడుతుండటం  సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు కరోనా  సోకడం పై స్పందించిన మంత్రి కేటీఆర్.. మాస్క్ పెట్టుకోవాలి అని చెప్తే పద్మారావు పెట్టుకోలేదని మరుసటి రోజు ఆయనకు కరోనా  వచ్చింది అని కేటీఆర్ అన్నారు, కరోనా మరణాలు కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

 

 కరోనా కట్టడికి  తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని... రాజకీయ విమర్శలకు ఇది సరైన సమయం కాదు అంటూ తెలిపారు మంత్రి కేటీఆర్, ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒకచోట ఉంటాయని వాటిని పట్టుకుని బూచి పడడం తప్పు అంటూ కేటీఆర్ హితవు పలికారు,

మరింత సమాచారం తెలుసుకోండి: