ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​ ఎన్​కౌంటర్​లో ప్రధాన నింధితుడు, ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలు పోయేందుకు కారకుడైన రౌడీషీటర్​ వికాస్​ దూబే కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. దూబేను పట్టుకోవడం కోసం వెళ్లే క్రమంలో అతనికి ముందే సమాచారం అందించిన వ్యవహారంలో ఇద్దరు పోలీసు అధికారులను అరెస్ట్​ చేశారు.


చౌబేపూర్‌ పోలీసుస్టేషన్‌ అధికారి వినయ్‌ తివారీ, బిక్రూ ప్రాంత బీట్‌ ఇన్‌ఛార్జ్‌ కేకే శర్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల రాకపై సమాచారాన్ని ముందే లీక్‌ చేయడం సహా, సహచర సిబ్బంది ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి ఎన్‌కౌంటర్‌ సమయంలో ఘటనా స్ధలం నుంచి పారిపోయిన కేసు కింద వీరిద్దరిని అరెస్టు చేశారు.ఎన్​కౌంటర్​ స్థలం నుంచి పారిపోవడంపై చౌబేపూర్​ పోలీస్​ స్టేషన్​లో తివారీ, శర్మలపై మరో ఎఫ్​ఐఆర్​ నమోదైంది.ఎన్‌కౌంటర్‌ జరిగిన అనంతరమే ఈ ఇద్దరు పోలీసులను సస్పెండ్‌ చేశారు అధికారులు. తాజాగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


దూబే కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హరియాణాలోని ఫరీదాబాద్​లో దూబే ఉన్నట్లు సమాచారం వచ్చిన నేపథ్యంలో తనిఖీ చేయగా.. ముగ్గురు పట్టుబడ్డారు. వారిని జిల్లా కోర్టులో హాజరుపరిచారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: