పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఉపగ్రహం ద్వారా అంతర్జాల సదుపాయాన్ని కల్పించిన మొట్టమొదటి విమానాన్ని పరీక్షించింది చైనా. ఈ వినూత్న ఇంటర్నెట్ వ్యవస్థను క్వింగ్​డావో ఎయిర్​లైన్స్ విమానం క్యూడబ్ల్యూ 771లో ఉంచి పరిశీలించింది.
క్వింగ్​డావో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన విమానం చెంగ్డూ ష్వాంగ్లీయూలో దిగింది. ఈ ప్రయాణంలో 10,000 అడుగుల ఎత్తులో 100ఎంబీపీఎస్ స్పీడ్​తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించారు.

 


 లైవ్ ప్రోగ్రాంలు వీక్షించారు.హైత్రోపుట్ శాటిలైట్(హెచ్​టీఎస్) శ్రేణికి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం ఆధారంగా ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా విమానాల్లో కేయూ బ్యాండ్ సాయంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఇందులో ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటుంది. అయితే హెచ్​టీఎస్​ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కేఏ బ్యాండ్​ను చైనా సమకూర్చుకున్న నేపథ్యంలో హైస్పీడ్ అంతర్జాల సేవలు గగనతలంలో అందుబాటులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: