జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)లో ఫ్రాన్స్కు చెందిన గ్రూప్ ఏడీపీ రూ.4,565 కోట్లు పెట్టుబడి పెట్టింది. దీనితో జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారంలో మొత్తం 49 శాతం వాటాను కైవసం చేసుకుంది గ్రూప్ ఏడీపీ.జీఏఎల్... ఢిల్లీ, హైదరాబాద్ విమానాశ్రయాలను నిర్వహిస్తుంటుంది. ఈ సంస్థ ఫిబ్రవరి 21న కీలక ప్రకటన చేసింది. ఫ్రాన్స్కు చెందిన గ్రూప్ ఏడీపీ... తమ కంపెనీలో 49 శాతం వాటాను రూ.10,780 కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న మొదటి విడతగా రూ.5,248 కోట్లు చెల్లించి.. జీఏఎల్లో 24.99 శాతం వాటాను కొనుగోలు చేసింది గ్రూప్ ఏడీపీ.
ప్రస్తుతం గ్రూప్ ఏడీపీ నుంచి రెండో, చివరి పెట్టుబడి రూ.4,565 కోట్లు అందుకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పష్టం చేసింది. ఈ భారీ మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించనున్నట్లు తెలిపింది. ఫలితంగా సంస్థ క్యాష్ ఫ్లో, లాభదాయకత పెరుగుతాయని పేర్కొంది.ఈ ఒప్పందం ద్వారా జీఎంఆర్ విమానాశ్రయ వ్యాపారం నిర్వహణ, నియంత్రణలో.. గ్రూప్ ఏడీపీకి హక్కులు కలుగుతాయి. అలాగే జీఏఎల్ బోర్డులోనూ ప్రాతినిధ్యం లభిస్తుంది.