అమెరికా తుపాకీ సంస్కృతి మరోసారి అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. న్యూజెర్సీ రాష్ట్రం పీటర్​సన్​లోని ఓ వీధిలో కొంతమంది దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

 


దుండగులు ఓ వాహనం ద్వారా అక్కడికి చేరుకున్నారని, అయితే ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియదని స్థానికులు చెప్పారు. ఉద్దేశ పూర్వకంగానే ఈ దాడి జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఘటనపై పాసాయిక్​ కౌంటీ ప్రాసిక్యూటర్​ కార్యాలయ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: