వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి చెందిన.. రూ. 329.66 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. పారిపోయిన ఆర్థిక నేరస్థుల చట్టం ప్రకారం.. ఆస్తులను అటాచ్ చేసింది. జప్తు చేసిన ఆస్తుల్లో ముంబయి ఒర్లిలో ఉన్న సముద్ర మహల్ భవనంలోని నాలుగు ఫ్లాట్లు, అలీబాగ్లోని భూమి, ఓ ఫాం హౌస్, జైసల్మేర్లో విండ్ మిల్, లండన్, యూఏఈల్లోని ఫ్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి.
అతని ఆస్తులు జప్తు చేసేందుకు ముంబయిలోని ప్రత్యేక కోర్టు.. జూన్ 8న అనుమతిచ్చింది. గతేడాది డిసెంబర్ 5నే నీరవ్ను ఇదే న్యాయస్థానం ఆర్థిక నేరస్థుడిగా ప్రకటించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద.. ఇప్పటివరకు నీరవ్ మోదీకి చెందిన రూ. 2,348 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది ఈడీ. 2019 మార్చిలో అరెస్టయిన నీరవ్ ప్రస్తుతం.. లండన్ జైలులో ఉన్నాడు.
ED confiscates Nirav Modi’s assets valued at Rs 329 crorehttps://t.co/Ifl99KPUok pic.twitter.com/ya13GlMahq
— Hindustan Times (@htTweets) July 9, 2020