రాబోయే 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఉభయ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు తెలంగాణాలోని ఉత్తర తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవచ్చు అని పేర్కొంది. 

 

అదే విధంగా  అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ సహా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 48 గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: