వికాస్ దుబే.. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు ఉత్తరాది రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇన్ని రోజులు అతని ఆగడాలు ఒక ఎత్తు ఇప్పుడు మరో ఎత్తు అనే విధంగా ఉంది అతని వ్యవహారం.  ఇటీవల కాన్పూర్ లో అతను 8 మంది పోలీసులను కాల్చి చంపినా సంగతి తెలిసిందే. ఇక అతని కోసం  ఇప్పుడు మూడు నాలుగు రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేసారు. 

 

ఉత్తరప్రదేశ్ తో పాటుగా హర్యానా, అలాగే పంజాబ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు బీహార్, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతని ముగ్గురు అనుచరులు కూడా హర్యానాలో దొరికారు. వారిలో ఇద్దరినీ పోలీసులు కాల్చి చంపారు. ఇక అతను హర్యానాలోనే ఉన్నాడు అని భావిస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: