ఏపీలో కరోనా ఎంతలా వణికిస్తుందో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో కరోనా తీవ్రత ఎక్కువుగా కనిపిస్తోంది. ఇక ప్రకాశం జిల్లాలో కరోనా కేసులు అధికారికంగాన రోజుకు 100 కుపైగానే ఉంటున్నాయి. ఇవి అనధికారికంగా చూస్తే అవి మరింత ఎక్కువ ఉంటాయని అంటున్నారు. తాజాగా మరో 110 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
ఈ కేసులు అన్ని కలిపితే ఇప్పటికే ఇల్లాలో కేసులు 1200 దాటేశాయి. బుధవారమే జిల్లాలో ఒంగోలు, మార్కాపురం, పామూరు ప్రాంతాల్లో భారీగా కేసులు నమోదు అయ్యాయి. బుధవారం కరోనాతో ఓ వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగి సహా ముగ్గురు మృతి చెందారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా 705 మంది క్వారంటైన్లలో ఉన్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 607 మంది డిశ్చార్జ్ అవగా...జిల్లాలో ప్రస్తుతం 589 యాక్టివ్ కేసులు ఉన్నాయి.