మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. అతనిని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాన్పూర్ లో 8  మంది పోలీసులను చంపి తప్పించుకుని తిరుగుతున్న వికాస్ దూబే కోసం దాదాపు 30 పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. 

 

అతని కోసం హర్యానా సహా ఉత్తరప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాలు అన్నింటిలో కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అతని ముగ్గురు అనుచరులను  పోలీసులు ఇప్పటి వరకు కాల్చి చంపారు. అతని కోసం ప్రత్యేక బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఇక నోయిడా లో అతను కనిపించాడు అనే సమాచార౦ కూడా పోలీసులకు అందింది. అయితే అతను అనూహ్యంగా మధ్యప్రదేశ్ లో పట్టుబడటం ఇప్పుడు ఆశ్చర్యం కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: