ఉత్తరప్రదేశ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ని మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ లో పోలీసులు దుపులోకి తీసుకున్నారు. ఉజ్జయనీ మహంకాళి దర్శనం కోసం ఏర్పాట్లు చేసుకుని వెళ్ళగా అతన్ని అక్కడి భద్రతా సిబ్బంది గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతను దొరికాడు అనే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 

 

ఏ  మాత్రం కూడా అతని విషయంలో అలసత్వం లేకుండా పోలీసులు వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులకు అతను దొరికిన సమయంలో కాస్త వింతగా ప్రవర్తించాడు అని తెలుస్తుంది. అయితే అతన్ని అదుపులోకి తీసుకోవడానికి భారీగా వెళ్ళారు పోలీసులు. కాగా ఎన్కౌంటర్ లో అతని ముగ్గురు అనుచరులను పోలీసులు ఇప్పటికే కాల్చి చంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: