మద్య దేశంలో కరోనా వైరస్ తో ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాతో ప్రముఖులు కూడా కన్నుమూస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రజా ప్రతినిధులు, సినీ సెలబ్రెటీలకు కరోనా సోకడం చూస్తూనే ఉన్నాం.. వారిలో కొంత మంది కన్నుమూశారు. తాజాగా టాలీవుడ్‌లో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. ఈ మద్యనే కరోనా బారినపడిన నిర్మాత పోకూరి రామారావు చనిపోయిన సంగతి మర్చిపోక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.

 

‘ఈ రోజుల్లో’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన  యువ హీరో శ్రీ ఇంట్లో విషాదం నెలకొంది. బుధవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఇది జరిగింది.  దుర్గా రాంప్రసాద్ 20 రోజుల క్రితం అనారోగ్యంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేరారు. అక్కడ అతనికి పరీక్షలు చేయగా కరోనా అని తేలడంతో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న సమయంలోనే పూర్తిగా విషమించడంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో మరణించాడు.

 

కాగా ఈ రోజుల్లో’ సినిమాతో శ్రీ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘లవ్ సైకిల్’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ లాంటి సినిమాల్లో హీరోగా చేశారు. కాగా గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలోని సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: